Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page

Bobbepalli Suresh Babu

Constituency Leader, Sarvepalli, Nellore, Andhra Pradesh, JanaSena.

 

Bobbepalli Suresh Babu is currently monitoring with the designation of Constituency Leader of Sarvepalli from JanaSena Party.

He was born on 01-April-1979 to Bobbepalli Ramanaiah and Ramanamma in Sarvepalli Village of Venkatachalam Mandal.

In 1994, Suresh Babu studied SSC Standard at ZP High School located at Sarvepalli and completed Intermediate from Sarvodhaya Junior College at Nellore in 1996.

He attained his graduation with a Degree(Bachelor of Commerce) from V.R College at Nellore in 1999.

Suresh Babu got married to Kusumalatha and this couple has two children, Lalitha(Elder Child), Snigdha(Younger Child).

In the year 2017, Suresh Babu began his political career by entering the JanaSena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

In the same year, he elected and designated the position of Constituency Leader for Sarvepalli from the JanaSena Party. Since then he has been working comprehensively all the time for the assigned position by discharging his duties.

Recent Activities

  • He accompanied many Mandal levels and District level party meetings in the Sarvepalli and also organized Party Membership Programs.
  • Many party development programs were carried out in the village for the growth of the party.
  • During MLA Elections, He actively participated in the election campaign and worked hard to bring more voters to the Party.
  • Suresh Babu performed many developmental programs related to the Party, Village, and Society.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed food, clothing, and Bedsheets to the Orphan Children and provided fruits, Meals to the homes of the old age by donating a certain amount whenever required.
  • Every year on the date of 14th April(B.R. Ambedkar Remembrance Day)and on the birth anniversary of Rabindranath Tagore and Vangaveeti Mohana Ranga, A Blood donation camp was set up in the village and also donated blood to the needy people.
  • He conducts Cultural activities in the school during national festivals and distributes Bags, Books, and other stationery items to the school students.
  • Every year he distributes food and clothing to the Mother Teresa Charitable Trust and also organizes the labor day Program by providing food to the roadside people and villagers.
  • If anyone in the village encounters any problem, Sathish Babu will be at the forefront of the problem and strive hard to enclose the issue in the district collector’s office.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free of cost to the needy people.
  • Suresh Babu is not limited to his services to the village but also extends to the people of the entire district.

Services rendered in the Pandemic:

  • Distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • As a token of gratitude to the police officers, fruits and water bottles were provided during the pandemic.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is persistently available mainly to the poorest people in the zone.

Village: Sarvepalli, Mandal: Venkatachalam, Constituency: Sarvepalli, Dist: Nellore, State: Andhra Pradesh.

e-Mail: [email protected]

Mobile: 9885471710

Recent Activities

పరామర్శ

మండల పరిధిలోని పోటుపాలెం గ్రామంలో రెండు నెలల యేరు దాటుతూ పవన్ అనే యువకుడు వాగులో పడి చనిపోయాడు. పవన్ సినీ హీరో పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. నిరుపేద కుటుంబం కావడం, చెట్టంత ఎదిగిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుఃస సభ్యులు తల్లడిల్లిపోయారు. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. దీంతో చదువుకుంటున్న పవన్ తమ్ముడు మధ్యలోన చదువుకు స్వస్తి చెప్పి కూలి పనులకు వెళుతున్నాడు. విషయం తెలుసుకున్న జన సైనికులం ఆదివారం పోటుపాలెంలోని పవన్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రిలే నిరాహార దీక్ష

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో రైతుల పక్షాన రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది.

శంకుస్థాపన

కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం శంకుస్థాపనల సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు సర్వేపల్లి నియోజకవర్గంలో శిధిలావస్థలో ఉన్న చెత్త సేకరించి ఎరువులు తయారు చేసే యూనిట్స్  శిధిలావస్థలో ఉండటంపై ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పాలకులు అని వాపోయారు

అనుచిత వ్యాఖ్యలకు స్పందన

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల పవన్కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు ఘాటుగా స్పందించడం జరిగింది 

చలో అమరావతి గోడ పత్రికలు ఆవిష్కరణ

14 వ తారీకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గం లోని వెంకటాచలం మండలం సర్వే పల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు చలో అమరావతి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ ఈ ఆవిర్భావ దినోత్సవ సభని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆపాలని చూడడం జరిగింది

విలేకరుల సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి జనసేన కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. 

సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలలో జనసేనపార్టీ నుంచి పోటీ చేసిన పెనుబాక ప్రమీలమ్మ గారు, మొలకల గారు, గడం సుజాత గారు వీర మహిళలను సన్మానించారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" డిజిటల్ క్యాంపెయింగ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే డిజిటల్ క్యాంపెయింగ్ లో భాగంగా ఈ రోజు సర్వే పల్లి గ్రామం లోని డా” బి.ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని కి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తి తో Raise Placards Andhra Mp అనే నినాదంతో అనే కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో MP లందరు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచారు, ప్రజల్లో తిరిగి విశాఖ ఉక్కు పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించడం జరిగింది, కేంద్రం ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.

రోడ్డు కూలిపోవడం

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు వెంకటాచలం మండలంలోని నేషనల్ హైవే నుంచి గురువింద పూడి మీదుగా ఇడిమేపల్లి ఈదగాలి పూడిపర్తి వైపు వెళ్లే రోడ్డు మార్గంలో గురువింద పూడి ,వడ్డీ పాలెం మార్గమధ్యలో పాత తూము కూలిపోవడంతో రాకపోకలకు ఎంతో ఇబ్బందులు పడుతూ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అవస్థలు పడుతూ ఉంటే అధికార పార్టీ నాయకులు గానీ అధికారులు గాని కూలిపోయిన తూము నిర్మించడం కోసం ఇప్పటివరకు ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అకాల వర్షాల కారణంగా పాతబడిపోయిన తూము కూలిపోయి 15 రోజులు అయితే ప్రజల అవస్థలు గుర్తించి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అక్కడ బ్రిడ్జి నిర్మించమని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారుల కి జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నమ్ అదేవిధంగా ప్రస్తుతానికి గ్రావెల్ వేసి తాత్కాలికంగా వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పించే విధంగా రోడ్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది.

దీక్ష

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సంఘీభావ దీక్షకు మద్దతు గా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో దీక్ష. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు తానేటి విశ్వనాథం గారు ఉద్యమం చేపట్టడం జరిగింది. 

ప్రభుత్వానికి విన్నపం

ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల కారణంగా వరదలు వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోవడం ఆస్తినష్టం గ్రామాల కొట్టుకుపోవడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులు స్వాధీనం చేసుకుని వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది.

పబ్లిక్ టాయ్లెట్ సమస్య గూర్చి వివరణ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు ముత్తుకురు మండల MPDO గారి ని కలసి ప్రధాన సమస్య పబ్లిక్ టాయ్లెట్ గురించి వివరించడం జరిగింది. 

డిమాండ్

ఇండస్ట్రియల్ హబ్ కోట్ల రూపాయలు విలువచేసే బూములు ఆయితే ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి చూస్తే నిరుపయగంగా సరైన వసతులూ లేకపోవడం అదేవిదంగా లీజుకీ తీసుకునవరు సబ్ లీజుకి ఇవడం వారు నిరుపయోగంగా వదిలేయడం అనుమతులు లేకుండా కోని ఆయిల్ కంపెనీ ముడుపులు చేలిస్తు కొనసాగిస్తూనారని అదికారులు ఇకనైనా కళ్ళు తెరచి ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.

డిమాండ్

రిజర్వాయర్ నీటి సామర్థ్యం 1.7 టీఎంసీలు కలిగి ఉండి 15 వేల ఎకరాలు కి సాగునీరు పంటకి అందిస్తూ 600000 పుట్లు 120 కోట్ల రూపాయల వరకు వచ్చేది అయితే ఈ నష్టని ఎవరు బరిస్తారు కనీసం పంట లేకపోవడంతో చిన చిన రైతులు పరిస్థితి ఎమిటి అదేవిధంగా 4 వందల కుటుంబాలు ఇదే రిజర్వాయర్ల లో చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రభుత్వం స్వార్థం కోసం ఏదైతే రిజర్వాయర్ పనులు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో పంట లేకుండా చేశారో చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు 60 వేల రూపాయలు అందించి వారిని తక్షణమే ఆదుకోవాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.

జయంతి

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. 

రోడ్ల పరిశీలన

రాష్ట్రంలో అద్వానంగా ఉన్న రోడ్ల దుస్థితి పై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం లోని తోటపల్లిగూడూరు మండలం పరిధిలో ధ్వంసమైన రోడ్ లను పరిశీలించడం జరిగింది. అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడో వ రోజు రోడ్లు పరిశీలన అదేవిధంగా ప్రభుత్వం త్వరిత గతిన ఎక్కడైతే గుంతలు ఉన్న రోడ్లను పునర్నిర్మాణం జరగాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల క్రితం రోడ్లు ఎంత దుస్థితిలో ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క గుంతల మాయమైన రోడ్లను పునర్నిర్మించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

కలిసిన సందర్భంలో

నెల్లూరు కి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మరియు రాష్ట్ర కార్యదర్శిలు శ్రీ బేతపూడి విజయ్ గారు నెల్లూరు కి విచ్చేసిన సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హోటల్ మినర్వా నందు గౌరవ ప్రదంగా కలవడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం లో మండల తాసిల్దార్ కార్యాలయం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొబ్బేపల్లి సురేష్ బాబు గారు కొందరు మండలం నాయకులతో కలిసి పొదలకూరు మండలం లో ఏర్పాటు చేయబోయే మినీ స్టేడియం ఏదైతే ఉందో దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఖరారు చేయాలని మండల కార్యాలయం నందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

గ్రావెల్ మాఫియాని అరికట్టండి

రాష్ట్రంలో  ఎక్కడా  జరగని  విధంగా  సర్వేపల్లి  నియోజకవర్గం వెంకటాచలం మండలం లోని అక్రమ గ్రావెల్ మాఫియా  పేట్రేగి పోతూ ఉంటే  ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారు  సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రావెల్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి  అలా జరగని పక్షంలో జనసేన నిరసన దీక్ష చేపడుతుంది అని సురేష్ గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా  పార్లమెంట్ కన్వీనర్ పోలంరెడ్డి  ఇందిరా రెడ్డిగారు మరియు సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధిలో భాగంగా

గుంతలు పూడుస్తున్న జనసేన నేతలు..

గ్రామ అభివృద్ధిలో భాగంగా

గ్రామం అంతటా పర్యటిస్తున్న సందర్భము

బియ్యం పంపిణీ

సరేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని పలు ప్రాంతాలలో పర్యటించి అక్కడి గిరిజనుల సమస్యలు ఆదాల నగర్ బిట్టు-1 లో 10 గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు మరి ఆ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలకి ఉండటానికి ఇల్లు లేదు అకాల వర్షం వస్తే ఆ వర్షంలోనే ఆ గుడిసెలోనే పసిబిడ్డలను పెట్టుకొని గడిపి గడిపే పరిస్థితి కనీసం ఆధార్ కార్డు రేషన్ కార్డు గాని లేదు మరి అక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఇప్పటివరకు వాళ్ల గురించి పట్టించుకోక పోవడం చాలా బాధాకరమైన విషయం అయితే వాళ్లు ప్రతి నెల 20 రూపాయలు పెటి రేషన్ బియ్యం కొనుక్కొని తింటున్నారు అంటే ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి తెలుస్తుంది అయితే ఆ 10 కుటుంబాలలో 8 కుటుంబాలకి ప్రతి నెలా బియ్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

డిమాండ్

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం లో ఆర్ ఆర్ కాలనీ కి అనుకొని నివసిస్తున్న 10 గిరిజన కుటుంబాలకు బియ్యం ఇవ్వడం జరిగింది వాళ్లకి కనీసం రేషన్ కార్డు గానీ ఆధార్ కార్డు గానీ ఓటర్ కార్డు గానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అట్టడుగున ఉన్న వర్గాలలో గిరిజనులు వీళ్ళకి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు ఆ ప్రకటనలు పేపర్లకు మాత్రమే పరిమితమవుతున్నాయి అకాల వర్షాలు వస్తే కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్పి డప్పు కొట్టుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో అభివృధ్ధి ఎక్కడ చేస్తున్నారు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందే పరిస్థితి లేదు మరి అమ్మ ఒడి ఎవరికి వెళ్తుంది కొత్తగా ఇచ్చే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి పేద గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. 

ప్లాస్టిక్ చెత్త చెదారం

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లో జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముత్తుకూరు మండలం బస్టాండ్ ఆనుకొని ఉన్న ఆటో స్టాండ్ వద్ద ప్లాస్టిక్ చెత్త చెదారం అక్కడ వేయడం జరుగుతుంది దానివలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నచిన్న వ్యాపారస్తులు అక్కడ బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు అందరు కూడా ఆ వాసనకి నిలబడలేని పరిస్థితి మరి ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఎవరూ కూడా ఎత్తకపోవడం తో మా దృష్టికి రావడం జరిగింది

ప్రహరీ గోడను నిర్మించాలని వినతి

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు వెంకటాచలం మండలం లోని ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సర్వేపల్లి గ్రామపంచాయతీ లోని 5 కులాల వారు వినియోగించుకునే స్మశాన వాటిక సర్వేనెంబర్ 1606 లో ఉంది అయితే ఆ యొక్క స్మశానానికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయి కంపచెట్ల తో మురికి నీరు తో నిండిపోయి మురికి కాలువ లాగా తయారయింది దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కనీసం గ్రావెల్ తో రోడ్డుని నిర్మించి ఇవ్వాలని కోరడం జరిగింది అదేవిధంగా స్మశానం ఏదైతే ఉందో వర్షాకాలంలో వర్షంతో నిండిపోయిన చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి చుట్టూ ప్రహరీ గోడను కూడా నిర్మించాలని వారిని కోరడం జరిగింది. 

పార్టీలోకి చేరిక

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం మండలం గోవిందరాజు పురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. 

విలేకరుల సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బొబ్బేపల్లి సురేష్ బాబు గారు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సినిమా టికెట్ రేట్ల విషయంలో నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు సభలో చేసిన వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తూ వినోదాన్ని పేదల ఒకటే కాకుండా ధనవంతులు కూడా కోరుకుంటారు దీని వల్ల పేదలకు ఎటువంటి లాభం లేదు మీరు ప్రత్యేకంగా పేదల కోసం ఆలోచించేవారు అయితే నిత్యావసర సరుకులు, పెట్రోలు, బస్సు చార్జీలు, రోడ్లు, ఇంటి నిర్మాణ సామాగ్రి, విద్య వైద్యం వాటిని ధరలను అదుపులోకి తీసుకు రావాలి అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు అలాంటి వాటికి జనసేన పార్టీ తరఫున మీకు సహకరిస్తామని తెలియజేశారు.

రహదారిని దిగ్భందనం

ఆత్మకూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట చుక్కల భూముల సమస్యల ఉద్యమ నాయకుడు, జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జిల్లాలోని వివిధ మండలాల నుండి రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్భందనం చేశారు.

స్మశాన వాటిక సమస్య

సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలం లోని పలు ప్రాంతాలలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు పర్యటించడం జరిగింది అయితే నియోజకవర్గంలోని ప్రధాన సమస్య స్మశాన వాటికలు లేక పోవడం వలన దహనసంస్కారాలు చేసుకునేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ప్రజలు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలలో స్మశానానికి సలాం అనేది లేకపోవడం ఏదైనా కొన్ని గ్రామాల్లో స్థలం ఉంటే వాటికి దారి లేకపోవడం వీటితో నరకయాతన పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టి ఎక్కడైతే స్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్నారో దారి లేక ఇబ్బంది పడుతున్నారో ఆయా గ్రామాలకు కు స్మశాన వాటిక లను ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న గతంలో కూడా ఎన్నోసార్లు నియోజకవర్గంలో స్మశానాలు అడ్డగించు కు గురి అయి నాయనే విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది

పర్యటన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ బొబ్బేపల్లి సురేష్ బాబు గారు తోటపల్లిగూడూరు మండలంలో నరుకూరు Bit-1 లో కాలువ గట్టు పై నివసిస్తున్న గిరిజన కాలనీ నందు పర్యటించడం జరిగింది. 

ఆహారం పంపిణీ

తుఫాన్ కారణంగా అకాల వర్షాలు ఏర్పడటంతో సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ నందు మరియు పరిసర ప్రాంతాలలో నివాసముంటున్న గిరిజన కుటుంబాలకు  జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. 

జయంతి

దేశ సమగ్రతను, జాతీయవాదాన్ని ప్రపంచానికి తెలిపిన మువ్వన్నెల భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా తెలుగు వారిగా పుట్టినందుకు గర్విస్తూ,భారతీయులందరి తరుపున ఘననివాళి అర్పిస్తున్న బొబ్బేపల్లి సురేష్ బాబు గారు..

 

సన్మానం

చిరంజీవి యువత జన సేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు గారికి జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా అందరితో కలిసి మెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తు రాష్ట్రంలోని 13 జిల్లాలు పర్యటన చేస్తున్న వారిని గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ రాష్ట్ర కార్యదర్శి గా నియమించినందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు కొట్టే వెంకటేశ్వర్లు గారి స్వగృహం నందు కలిసి శాలువా మరియు మొక్కను ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

వర్ధంతి

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, సాయి శంకర్, గోపీ,మల్లి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం

అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అండగా అధికార పార్టీ జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసే విధంగా రిలీజ్ చేసిందో అందులో ఏ ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయి ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో ప్రచురించాలనేటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీ జిల్లా ఉపాధి అధికారి కి వినతి పత్రం ఇవ్వడం కోసం వెళ్లిన జనసేన పార్టీ నాయకులను జనసైనికుల అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ..

నిర్మాణం కోసం మెమోరాండం అందజేత

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వే పల్లి పంచాయతీ పరిధిలోని లింగంగుంట గిరిజన కాలనీ గిరిజన కాలనీ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది అయితే ఈ గిరిజనులు కుటుంబాలలో ఎవరైనా కాలం చెల్లితే పక్కనే ఉన్న స్థలంలో స్మశానవాటిక వాడుకునేవారు అయితే ఆ స్మశానవాటిక అనుకొని పొలాలు ఉండటంతో కొందరు రైతులు ఆ స్మశానాన్ని ప్రతి సంవత్సరం కొంచం కొంచం పొలాల్లో కలుపుకోవడం జరిగింది. 

 

అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలి

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీ పరిధిలో అధికార పార్టీ అండతో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తరలింపు ను పరిశీలించడం జరిగింది.
ఇకనైనా అక్రమ తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎక్కడైతే గ్రామాలకి జన సంచారానికి దగ్గరలో తవ్వకాలు జరిగి ఉన్నాయో ఆ గుంటలలో ముగా ప్రాణులు కానీ మనుషులు కానీ అకాల వర్షంతో నిండిపోతే ఆ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చుట్టూ రక్షణ వలయం ఐన ఏర్పాటు చేయాలని  జనసేన పార్టీ తరఫున సురేష్ బాబు డిమాండ్ చేసారు. 

కాలువలను శుభ్రం చేయించాలని మనవి

 సర్వేపల్లి నియోజకవర్గ  అభివృద్ధి అంటే  పొదలకూరు మండలం లో అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అభివృద్ధి ఎలా ఉంది అనే విషయం అర్థమవుతుంది.
రోడ్లపై మురుగు నీరు కాలువలలో చెత్త పేరుకుపోయి వుండడం, నడి బొడున చెత్త ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా రేపు రాబోయే వర్షాలు తో మురుగు నీటి తో నిండి పోతే అంటురోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి  మురుగు  కాలువలను శుభ్రం చేయించే విదంగా పనులు చేపట్టాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసెన పార్టి జనసేవ కుడు బోబ్బేపల్లి  సురేష్ బాబు కోరారు

గ్రావెల్ మాఫియాని అరికట్టండి

రాష్ట్రంలో  ఎక్కడా  జరగని  విధంగా  సర్వేపల్లి  నియోజకవర్గం వెంకటాచలం మండలం లోని అక్రమ గ్రావెల్ మాఫియా  పేట్రేగి పోతూ ఉంటే  ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారు  సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రావెల్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి  అలా జరగని పక్షంలో జనసేన నిరసన దీక్ష చేపడుతుంది అని సురేష్ గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా  పార్లమెంట్ కన్వీనర్ పోలంరెడ్డి  ఇందిరా రెడ్డిగారు మరియు సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని మండల నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మూడు సంవత్సరాల నుంచి అధికారపక్షంలో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా మా అధ్యక్షులు జనసేననీ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యవసాయం గురించి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా చిత్రంగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటపాలెం పంచాయతీలో భూగర్భజలాలను అధికార పార్టీ నాయకులు ఆయిల్ కంపెనీలకు అమ్ముకుంటుంటే నోరుమెదపని అక్రమంగా రెబల్ తవ్వకాలు అనుకుంటుంటే నోరుమెదపని మంత్రి అభివృద్ధి చూస్తే గుండుసున్నా అటువంటి మీరు మా అధ్యక్షులు కి వ్యవసాయం గురించి తెలియదని మాట్లాడతారా వ్యవసాయం గురించి తెలియకపోవచ్చు మీ దృష్టిలో కానీ రైతు కన్నీరు పెడుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి అయితే కాదు.

పర్యటన

 సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామం నందు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు పర్యటించి అక్కడ స్థానికంగా ఉన్న హరిజనవాడ కి సంబంధించిన కొంత మందిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా 35 కుటుంబాలు నివాసం ఉంటున్న హరిజనవాడ కు సంబంధించిన వారు కాలం చెల్లితే స్మశానానికి వెళ్లాలంటే ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలి కిలోమీటర్ కూడా వెళ్లడానికి దారి లేదు దయచేసి ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని మీకు ఎన్నో సార్లు హరిజనవాడ ప్రజలు వినతిపత్రాలు ఇచ్చిన వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఇకనైనా వాళ్ల సమస్యని పరిష్కరించండి అలా జరగని పక్షంలో వాళ్లకు అండగా నిలబడి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే అంతవరకు జనసేన పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.

ఇళ్ల స్థలాలు పరిశీలన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఎర్రగుంట నందు పేదలకిచ్చే ఇళ్ల స్థలాలు పరిశీలించిన జనసేన… పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు రూ.కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే పేదలకోసం 218 ప్లాట్లను కేటాయించారు. అందులో నాలుగు ప్లాట్లు పబ్లిక్ కి సంబంధించిన కార్యకలాపాలకు కేటాయించగా మిగిలిన 214 ప్లాట్లలో 88 ఫ్లాట్లు మాత్రమే పేదలకు పంపిణీ చేయడం జరిగింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి

 ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కావలి హరిజనవాడ నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయం అన్నివర్గాలకు న్యాయం జరగాలి అంటే అయన సిద్ధాంతం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఒక జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు జనసేన పార్టీ నాయకులు సురేష్ బాబు గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు శ్రీపతి రాము గారు, స్థానికులు కావాలి పవన్ కుమార్ ,హరిబాబు, రహీం భాయ్, వీరబాబు ,రవి కుమార్ ,సందీప్, శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు

నిరసన

వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలను సోమవారం జనసేన జిల్లా కమిటీ సభ్యురాలు పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, నాయకులు అవినాష్, సాయి, విష్ణు, చందన్, వంశీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు చేత పట్టుకొని నిరసన తెలిపారు

సర్వేపల్లి  నియోజకవర్గం ముత్తుకూరు మండలం నారికెళ్ళ పల్లి పంచాయతీ లోని  వీధులన్నిటిని  బ్లీచింగ్ తో శనిటైజ్ చేయడం జరిగింది ఎక్కువ కేసులు ఉండడంతో పంచాయతీ వారు పట్టించుకోక పోవడం తో స్థానికులు జనసేన పార్టీ నాయకుడు మహేంద్ర గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు బాలు, బాలకృష్ణ, కళ్యాణ్, చందు, విష్ణు సాయి, వంశీ సాయి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడి నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు…

ప్రచారం

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నారికేళ పల్లి నందు జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి రమణ గారు ఎంపిటిసి కి పోటీ చేస్తున్నారు వారి తరఫున పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటు కన్వీనర్ పొల్లం రెడ్డి ఇందిరారెడ్డి స్థానికులు మహేందర్ వీరబాబు బాలు తదితరులు పాల్గొన్నారు… 

ఆర్ధిక సహాయం

షార్ట్ సర్క్యూట్ కారణంగా అనంతపురంలోని శివ ఇల్లు కూలిపోవడం జరిగింది. అందువల్ల సర్వేపల్లి జనసేన పార్టీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు వారికీ కొంత నగదు, నిత్యావసర సరకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ కన్వీనర్, పోలంరెడ్డి ఇందిరారెడ్డి, ముత్తుకూరు మండల నాయకులు వీరబాబు, బాలు, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

నివాళి

భగత్ సింగ్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహానుభావుడికి నివాళులర్పించిన జనసేన పార్టీ సభ్యులు

సమస్యలకు పరిష్కారం

సురేష్ బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ ప్రజలకు, గ్రామానికి సంబంధించిన సమస్యలను వివరిస్తూ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు…

వినతి పత్రం

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో ఉన్న M.R.O కార్యాలయంలో గ్రామ ప్రజలు మరియు గ్రామానికి సంబంధించిన సమస్యలను వివరించే అభ్యర్థన పత్రాన్ని సురేష్ బాబు అందజేశారు.

అధికారిని కలిసిన సందర్భంలో

నెల్లూరు రోటరీ క్లబ్లో దాసరి రాము గారిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందచేసిన సురేష్ బాబు గారు మరియు తదితరులు.

సమస్యను పరిష్కరించడం

జనసేన నాయకురాలు పర్యాటక ఉద్యోగి పని సమయంలో తాను ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల గురించి ఆరా తీస్తున్న సందర్బములో…

నాయక భాద్యత నిర్వహణ

వెంకటాచలం మండలంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలానే ఆలోచనతో వారు ఎదుర్కుంటున్న ఇబంధులను అడిగి తెలుసుకుంటున్న సురేష్ బాబు గారు గారు మరియు జనసేన పార్టీ నాయకులు…

అనాధాశ్రమానికి ఆహారంపంపిణీ చేస్తున్న సురేష్ బాబు గారు 

ధర్మ పోరాట దీక్ష

Tribute to Singer Bala subramanyam Sir

నిరుపేద యువత కి తోపుడు బండి సహాయం చేసి ఆయనకు జీవనాధారం కల్పించిన సురేష్ బాబు గారు

అంబేద్కర్ జయంతి వేడుకలలో

ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలోని దేవర దెబ్బ నందు 200 గిరిజన కుటుంబాలకు సరైన తాగునీరు లేక ఇబ్బందిపడుతూ ఉండడంతో ఈ రోజు ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నీటిని అందజేయడం జరిగింది..

 Party Activities

పేదవారికి అండగా

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనుబోలు మండలం బద్వేల్ రోడ్ లోని సంగమేశ్వర గిరిజన కాలనీ నందు నివాసం ఉంటున్న పేద గిరిజనులకు అకాల వర్షాలతో చేతిలో పనులు లేక పూట గడవడం కష్టంగా ఉండటంతో వారికి భోజనం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు వారికి ఎప్పుడూ అండగా జనసేన పార్టీ ఉంటుందని అదేవిధంగా ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని ఎన్నికల సమయంలో ఓటు కి డబ్బులు అయితే ఇవ్వము కానీ ప్రజల కి ఎటువంటి కష్టం వచ్చిన మేమున్నామంటూ అడుగు ముందుకు వేసే అండగా ఉండే పార్టీ ఒక్క జనసేన పార్టీ అని తెలియజేశారు

నిత్యావసర సరుకులు అందజేయడం

మండలంలోని మామిడిపూడి గ్రామ పంచాయతీలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైసర్వస్వము కోల్పోయిన బాధిత కుటుంబమైన నల్లబోతూ వెంకటేశ్వర్లుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సాయం చేయడం జరిగింది.. జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు తన సొంత నిధులతో ఆ కుటుంబానికి అవసరమైన బట్టలతోపాటు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో...

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భక్తుడు హరీష్ రావత్ తన స్వంత ఖర్చులతో జన స్వరం పుస్తక ప్రచురణ చేసి పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది అందులో 2019 నుంచి ఈనాటి వరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు పొందుపరచడం జరిగింది

నిరసన దీక్ష

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విలేకర్ల సమావేశంలో లో సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని నివాసంఉండడం వలన వారు కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే ఎదురుగా ఉండే సివాయి స్థలంలో దహన సంస్కారాలు చేసుకునేవాళ్ళు ఆ స్మశానానికి ఒకవైపు చెరువు కట్ట ఇంకొకవైపు పొలాలు ఉండడంతో కాలక్రమేణా పొలాల్లో కలిపేసుకోవడం జరిగింది.

హెచ్చరిక

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో కొందరు అధికార పార్టీ నాయకులు గ్రావెల్ మాఫియా సిండికేట్ గా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. మండలంలోని 10 గ్రామాలలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న అధికారులలో ఎలాంటి చలనం ఉండక పోవడం గమనార్హం. ఎవరు కనీసం పట్టించుకోకపోగా నెలసరి మామూళ్లు తీసుకుని గ్రావెల్ మాఫియాకి పూర్తిగా సహకరిస్తున్నారని, అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటామని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు హెచ్చరించారు. 

అధికార పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలు

సర్వే పల్లి నియోజకవర్గం వెంకటాచల మండల పరిధిలో అనుమతులు లేకుండా కొద్ది రోజుల నుంచి అధికార పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలు జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎవరైనా ఈ విషయమై మండల అధికారులకు తెలియ చేసిన వారి పేర్లను అధికార పార్టీ నాయకులకు తెలియజేయడం వారి పైన అక్రమ కేసులు పెట్టడం వారిని బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నయి… ఇకనైనా ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలా జరగని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.

కృతజ్ఞతలు

నెల్లూరు జిల్లాలోనీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ప్రపంచంలోని ఎన్నో ప్రాణాలు కోల్పోయిన కరోనా వైరస్కి ఆయుర్వేద మందు కనుక్కోవడం జరిగింది. ఈ కరోనా వైరస్కి ఆయుర్వేద మందు కనుగొన్న ఆనందయ్య గారికి  జనసేన పార్టీ తరఫున పాదాభివందనం చేస్తున్నాను.

నిరసన దీక్ష

సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు ప్రైవేట్ కాలేజీలను తీసుకొని క్వారంటైన్ సెంటర్ల గా ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నిరసన దీక్ష.పాజిటివ్ అని నిర్ధారణ అయ్యి హోమ్ క్వరన్టైన్ లో ఉన్న వాళ్ళకి ఐసోలేషన్ కిట్టు ఇవ్వాలని , ప్రతి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ తో శానిటైజ్ చేయాలని , కష్టకాలంలో ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం కాదు కావలసింది ప్రతి కుటుంబానికి మంచి వైద్యాన్ని అందించే విధంగా కృషి చేయాలని మేం జనసేన పార్టీ తరఫున డిమాండ్ చెయ్యడం జరిగింది.

ఎన్నికలలో భాగంగా

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో భాగంగా పొదలకూరు మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు బిజెపి రాష్ట్ర నాయకులతో ప్రచారంలో పాల్గొనడం జరిగింది..

ప్రచారం

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల పరిధిలో జనసేన బిజెపి MPTC అభ్యర్థి శేష వర్ధన్ రెడ్డి గారిని గెలిపించాలని సర్వేపల్లి గ్రామ పరిధిలో ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటు కన్వీనర్ పోలంరెడ్డి ఇందిరా రెడ్డి గారు నెల్లూరు జిల్లా JAC మహిళా అధ్యక్షురాలు సుంకర అనిత గారు మరియు వినకోట సుభాషిని గారు మరియు బతు సునీత గారు స్థానికులు పాల్గొన్నారు.

ప్రచారం

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నారికేళ పల్లి నందు జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి రమణ గారు ఎంపిటిసి కి పోటీ చేస్తున్నారు వారి తరఫున పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటు కన్వీనర్ పొల్లం రెడ్డి ఇందిరారెడ్డి స్థానికులు మహేందర్ వీరబాబు బాలు తదితరులు పాల్గొన్నారు… 

సర్వ సభ్య సమావేశము

సర్వేపల్లి నియోజికవర్గంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశములో పాల్గొన్న బొబ్బేపల్లి సురేష్ బాబు గారు మరియు ఇతర నాయకులు..

సభ్యత డ్రైవ్ కార్యక్రమము

సర్వేపల్లి నియోజికవర్గంలో జరిగిన సభ్యత డ్రైవ్ కార్యక్రమమును నిర్వహించిన బొబ్బేపల్లి సురేష్ బాబు గారు మరియు తదితరులు.

నిరసన ర్యాలీ

జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో నిర్వహించనున్న లాంగ్ మార్చ్ కి మద్దతుగా నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యములో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది…

నాయక భాద్యత నిర్వహణ

వెంకటాచలం మండలంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలానే ఆలోచనతో వారు ఎదుర్కుంటున్న ఇబంధులను అడిగి తెలుసుకుంటున్న సురేష్ బాబు గారు గారు మరియు జనసేన పార్టీ నాయకులు…

ఉచిత రక్తదాన శిబిరం

నెల్లూరు జిల్లా వంగవీటి సేవాసమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా గారి 74 వ జయంతి సందర్భంగా గా సేవా సమితి అధ్యక్షులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు వంశీ గారి అధ్యక్షతన గీతా మయి వృద్ధుల ఆశ్రమం నందు నోవా బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పోలంరెడ్డి ఇందిరా రెడ్డి గారు మరియు పతి మల్లికార్జున్ గారు సంగి గారు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

నెల్లూరు జిల్లా వంగవీటి సేవాసమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా గారి 74 వ జయంతి సందర్భంగా గా సేవా సమితి అధ్యక్షులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు వంశీ గారి అధ్యక్షతన గీతా మయి వృద్ధుల ఆశ్రమం నందు కేక్ కటింగ్ మరియు అల్పాహారాన్ని అందించడం జరిగింది

గాంధీ జయంతి సందర్భంగా

Social Services 

నిత్యవసర సరుకులు పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అకాల వర్షాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నా వెంకటాచలం మండలం కనుపూరు గ్రామ గిరిజన కుటుంబానికి నిత్యవసర సరుకులు, కూరగాయలు, బియ్యం బస్తా అందజేయడం జరిగింది. అదే విధంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గిరిజనులు యొక్క జీవితంలో వెలుగులు నింపే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించడం లేదు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ అధికారులు వారికి ఉండటానికి గూడు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే లేవు గత 15 రోజుల నుంచి అకాల వర్షాలతో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేతిలో పని లేక అధికారులు ఆదుకోక అధికార పార్టీ నాయకులు ఇప్పటివరకు వారికి ఏ విధమైన సహాయం అందించక పోవడంతో వాళ్లు అల్లాడిపోతున్నారు ఎన్నికల సమయాల్లో మా ఓట్లు అయితే కావాలి కానీ మా సమస్యలను అయితే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ప్రభుత్వ అధికారులు ఇంకనైనా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మీరు పట్టించుకోని ఎడల గిరిజనులకు అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం అని సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది

దేవరదిబ్బ తాగునీటి సమస్యల పరిష్కార మార్గం

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం దేవర దెబ్బ నందు 200 గిరిజన కుటుంబాలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఏ ఒక్క నాయకుడు పట్టించుకోక పోవడం చాలా బాధాకరమైన విషయం. జనసేన పార్టీ వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది వారికి తాగునీరు అందించడానికి కృషి చేస్తాం అని వారికి హామీ ఇచ్చారు అయితే వాళ్ల గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ అధికార పార్టీకి సంబంధించిన వారితో మాట్లాడటం జరిగింది. వారు త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. 

ఆర్థిక సాయం

సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం వీరంపల్లి గ్రామ వాసి ఏడుకొండలు అనే వ్యక్తి గత పది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బోబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని పక్షంలో జనసేన పార్టీ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందేటట్లు చేస్తామని జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.. 

విజ్ఞప్తి

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో పొదలకూరు మండలం బిరదవోలు గ్రామానికి బడుగు ఆనందయ్య ఆయన భార్య చనిపోవడం తో తన ఇద్దరు పిల్లలను అమ్మమ్మ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబ పోషణ అనేది కష్ట సాధ్యం అవుతుంది కాబట్టి ఇటువంటి కుటుంబాలకు ప్రతినెల 10,000 రూపాయలు అందించినట్లయితే వారి పోషణ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 

ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన

కరోనా మహమ్మారి కారణంగా ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో చిరంజీవి గారు ఒక గొప్ప సంకల్పంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సొంత నిధులతో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించి ఆక్సిజన్ అందించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ మహానుభావుడు అటు బ్లడ్ బ్యాంకు అదేవిధంగా ఐ బ్యాంకు స్థాపించి ఎంతో మంది కి మార్గదర్శకం అయ్యాడు అదేవిధంగా 2020 March 20 తారీకు నుంచి లాక్ డౌన్ ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి సినీ పరిశ్రమలోని సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పస్తులు ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో సినీ పరిశ్రమ కార్మికుల కుటుంబాలకి ప్రతి నెలా నిత్యావసర సరుకులు నాణ్యమైనవి అందించడం జరిగింది…

నాటు మందు

ఆనందయ్య గారి నాటు మందు వైపు అయితే గత పది రోజుల నుంచి ఆనందయ గారు తయారు చేసే టువంటి మందుని అధికార పార్టీ ఆపడం జరిగింది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కొసం ఆనందయ్య గారి మందు కావాలని ఒకవైపు అల్లాడి పోతుంటే కమిటీలు రావడం ఆ మందు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పడం వెళ్ళిపోవడం జరుగుతోంది ఆనందయ్య గారి మందు కొరియర్లో పంపిస్తామ్ యాప్ తయారు చేస్తామ్ ప్రతి మండలానికి అందిస్తాం ఇటువంటి కల్లబొల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ వాళ్ళ పరిధిలో పెట్టుకొని సీక్రెట్ గా తయారు చేయించుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు పంపించుకుంటున్నారు. ప్రజలు ఇకనైనా గమనించాలి అని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆనందయ గారు ద్వారా ఈ కరోనా మహమ్మారి కి నాటు మందు ని మళ్లీ యధావిధిగా కొనసాగే లా చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం…

పారిశుద్ధ్య కార్యక్రమం

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం చెముడు గుంట గ్రామపంచాయతీ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాo చేపట్టడం జరిగింది గ్రామాలలో ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలలో ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునే దిశగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం జనసేన పార్టీ తరఫున గెలిస్తేనే పని చేస్తాo లేకపోతే పట్టించుకోమ్ అనే విధానం అయితే జనసేన పార్టీ ది కాదు ప్రజల బాగోగులే లక్ష్యం గా పని చేసే పార్టీ జనసేన పార్టీ మాత్రమే.ఈ కార్యక్రమంలో స్థానికలు శ్రీనివాసులు గారు సతీష్ గారు మరియు అవినాష్ వంశీ తదితరులు పాల్గొన్నారు

covid-19 మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

సర్వేపల్లి  నియోజకవర్గ  జనసేన పార్టీ కార్యాలయం నందు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు మాట్లాడుతూ  కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో ప్రజలు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది దీనికి కారణం సరైన వైద్యం అందించలేక పోతున్నా ప్రభుత్వం  కుటుంబ యజమాని బలై పోతే ఆ కుటుంబం రోడ్ల పాలు అవుతుంది కాబట్టి కుటుంబ యజమాని  కరోనా తో మరణిస్తే ఆ కుటుంబానికి  50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున సురేష్ బాబు గారు  డిమాండ్  చేసారు.  ప్రభుత్వానికి  పథకాలను అమలు చేయడంలో ఉన్నంత ఉత్సాహం ప్రజల ప్రాణాలను కాపాడడం లో ఎందుకు  ఇంత నిర్లక్ష్య ధోరణి ఉచిత బియ్యం వద్దు కావాల్సింది ప్రతి  కుటుంబానికి  మెరుగైన ఉచిత వైద్యం మరి ఎందుకు వైద్య మీద దృష్టి పెట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరచి ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది.

నిరసన

సర్వేపల్లి నుంచి తిక్కవర పాడు గొట్లపాలెం మీదుగా గొలగమూడి కి వెళ్ళి గొలగమూడి నుంచి నెల్లూరు రోడ్డు మార్గం అయితే గోట్లపాలెం దగ్గర నుంచి ఆరు కిలోమీటర్ల రోడ్డు అయితే పూర్తిగా ధ్వంసమై అయిపోయింది మరి 7 సంవత్సరాల నుంచి ఇదే స్థితిలో ఉంటే పాలకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం జరగాలి అని నిరసన చేపట్టడం జరిగింది… 

సహాయం

నెల్లూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైదులకు మరియు రోగులకు ఉపశమనం కోసం త్రాగుటకు ఛాయ్ అందచేయడం జరిగింది…

కార్మిక దినోత్సవం కార్యక్రమం

మే 1వ తేదీన కార్మిక దినోత్సవం కార్యక్రమ సందర్బంగా కార్మికులకు, నాయకులకు పూలమొక్కలు అందచేయడం మరియు సర్వేపల్లి గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణి చెయ్యడం జరిగింది.

ఉచిత వైద్య శిబిరం

సర్వపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి,  అవసరం ఉన్న గ్రామస్తులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు…

పూలమొక్కలన పంపిణీ

మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్ట్కు ఆహారం మరియు పూలమొక్కలను పంపిణీ చేయడం జరిగింది…

 

నివాళి

అల్లూరి గారు మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క జయంతి రోజున వారి యొక్క చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళి అర్పించడం జరిగింది.

పెన్షన్ మరియు రేషన్ కార్డు సమస్యలు

సర్వేపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్ మరియు రేషన్ కార్డు సమస్యలను పర్యవేక్షిస్తున్న బొబ్బేపల్లి సురేష్ బాబు గారు..

పరీక్షా సామాగ్రి అందచేయుట

KSN జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల నందు ప్రజాసత ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొన్న అక్కడ విద్యార్థులకు పదవ తగతిలో అత్యధిక GPA సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000/- ఇస్తాను అని పూర్వ విద్యార్థిగా వారికీ వాగ్దానం చెయ్యడం జరిగింది. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందచేస్తామని పూర్వ విద్యార్థి, సర్వేపల్లి నియోజిక వర్గ జనసేన నాయకుడు శ్రీ బొబ్బేపల్లిలు సురేష్ బాబు గారు తెలియజేసారు..

Social Activities

ఆహారం పంపిణీ

గత రెండు రోజుల నుంచి అకాల వర్షాల కారణంగా చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న రెక్కాడితే డొక్కాడని కొందరి పేదలకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం లోని పిడతా పోలూరు గ్రామానికి దరిదాపుల్లో కాలవకట్ట పై ఉన్నటువంటి పేదలకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. 

నిరసన దీక్ష

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ నిరసన దీక్ష కరోనా మహమ్మారి అరికట్టాల్సిన మండల ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులు…పంచాయతీలలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ మేము నిరసన దీక్ష చేపట్టడం జరిగింది పంచాయతీలలో జరుగుతున్నటువంటి ఈ అక్రమo 250 రూపాయలకు 40 కేజీలు దొరికే నాసిరకం సున్నాన్ని తీసుకుని వచ్చి ప్రతి 10బస్తాలు సున్నంలో మూడు బస్తాలు నాసిరకమైన బ్లీచింగ్ పౌడర్ కలిపి శానిటైజ్ చేస్తున్నారు…

Blood Donation Camp

రక్తదానం చేస్తున్న సురేష్ బాబు గారు మరియు జనసేన పార్టీ సభ్యులు

Medical Camp and Plantation

చిన్నారులకు భోజనం వడ్డిస్తున్న సురేష్ బాబు గారు

మెడికల్ క్యాంపు

మెత్కుర్ లో మెడికల్ క్యాంపు నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలు

Fruits Distribution

భవన నిర్మాణ కార్మికుల లాంగ్ మార్చ్

వర్ధంతి కార్యక్రమంలో

వంగవీటి రంగ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు గారు మరియు జనసేన పార్టీ సభ్యులు

ఆహారం పంపిణీ

 లాక్ డౌన్ సమయంలో ఆహారం పంపిణీ చేస్తున్న సురేష్ బాబు గారు

చేయూత

నిరుపేదలకు సహాయం చేస్తున్న సురేష్ బాబు గారు

హరితహారం కార్యక్రమం

పొదలకూరు లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు గారు మరియు జనసేన పార్టీ నాయకులు

గవర్నమెంట్ సాంక్షన్ చేసిన భూమి గురించి గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న సురేష్ బాబు గారు

గ్రామ ప్రజల భూమి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సురేష్ బాబు గారు

 సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లో బిజెపి రాష్ట్ర నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

Services in Pandemic Covid-19

Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page

Election Campaign 

Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page
Bobbepalli Suresh Babu | Constituency Leader | Sarvepalli | JanaSena | the Leaders Page

News Paper Clippings

}
01-04-1979

Born in Sarvepalli Village

of Venkatachalem Mandal

}
1993-1994

Finished Schooling

at ZPHS, Sarvepally

}
1995-1996

Completed Intermediate

from Sarvodhaya junior College, Nellore.

}
1998-1999

Attained Graduation

from VR College, Nellore.

}
2017

Joined in the JanaSena Party

}
2017-till now

Constituency Leader

of Sarvepally